calender_icon.png 9 June, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం

09-06-2025 12:25:29 AM

మహదేవపూర్(భూపాలపల్లి) జూన్ 8 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ ఎగువన గోదావరిలో శనివారం ఈత సరదాకి వెళ్లి గల్లంతైన ఆరుగురి యువకుల మృతదేహాలను ఆదివారం లభ్యమైనాయి.

గోదావరిలో ఈత సరదాకి వెళ్లి గల్లంతైన యువకుల మృతదేహాలను వెలికితీయుటకు భూపాలపల్లి జిల్లా అదరపు ఎస్పీ నరేష్ , కాటారం సబ్ కలెక్టర్ మాంకా సింగ్, కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, ఆధ్వర్యంలో భూపాలపల్లి సింగరేణి రిస్కు బృందాన్ని రప్పించి రాత్రి 9 గంటల నుండి వెతకడం ప్రారంభించారు. 16 గంటలు గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం మధ్యాహ్నం మృతదేహాలు లభించాయి.

ఈ యువకుల మృతదేహాలను మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆసుపత్రి ప్రాంగణంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. రాష్ట్ర ఐటీ పర్సనల్ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వ్యక్తిగత సాయకుడు ప్రవీణ్ పోస్టుమార్టం కిట్లు ఇచ్చి మృతుల బంధువులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.

మృతి చెందిన యువకుల వివరాలు తొగరి రక్షిత్ ( 13), కర్నాల సాగర్ (17), పట్టి మధుసూదన్ (20), పట్టి శివ మనోజ్ (16), ఈ నలుగురు యువకులు అంబటిపల్లి గ్రామానికి చెందినవారు, పసుల రాహుల్ (19), ముత్తారం మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన యువకుడు, బెల్లంకొండ రామ్ చరణ్, (18), మహా ముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన యువకుడు మొత్తం ఆరుగురు మృతి చెందినరు.ఇద్దరు యువకుల తండ్రి పట్టి వెంకటస్వామి గ్రామం అంబటిపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర పవన్ కుమార్ తెలిపారు.