13-06-2025 10:54:21 PM
బోడగుట్టను కాపాడండి
డిప్యూటీ తహసిల్దార్ కు వినతిపత్రం
వలిగొండ,(విజయక్రాంతి): మట్టి మాఫియాని అడ్డుకొని వేదశ్రీ వెంచర్ ప్రక్కన గల గుట్టను కాపాడాలని అరూర్ గ్రామానికి చెందిన పలువురు డిప్యూటీ తహసిల్దార్ పల్లవికి వినతి పత్రం అందజేశారు. శుక్రవారం మండలంలోని అరూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూ భారతి కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ తహసీల్దార్ ని వేద శ్రీ వెంచర్ దగ్గర గల 409 సర్వే నంబర్ గుట్టలకు అనుకోని ఉన్న భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని అట్టి భూమికి సర్వే చేయించి హద్దు రాళ్ళు నాటించాలని మట్టిని కూడా తీసుకొని వెళ్లకుండా చూడాలని కోరారు. గుట్ట వెంట పశువులను జీవాలను మేపుకుంటూ ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారని, మట్టి తీయడంతో చెట్లు గడ్డి లేకుండా పోతుందని దీంతో పశువులకు జీవాలకు మేత దొరకకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా బద్ధం రామకృష్ణ రెడ్డి కాలనీ పక్కన బోడ గుట్ట చుట్టూ కూడా హద్దు రాళ్ళు నాటించాలని కోరారు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో అరూర్ గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు.