calender_icon.png 23 June, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘భూ భారతి’తో సమస్యలకు పరిష్కారం

04-06-2025 12:00:00 AM

జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ 

జగిత్యాల, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ’భూ భారతి’ చట్టం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు.

జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో గల మెట్పల్లి మండల కేంద్రం, పెద్దాపూర్ గ్రామంతో పాటూ ఇబ్రహీంపట్నం మండలం పకీర్ కొండాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.శ్రీనివాస్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం తహశీల్దార్లు, సంబంధిత అధికారులుపాల్గొన్నారు.

పంట విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  

   జగిత్యాల అర్బన్, జూన్ 3 (విజయక్రాంతి): పంట విస్తీర్ణానికి అనుగుణంగా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కోరుట్ల ని యోజకవర్గంలోని మెట్పల్లి పట్టణ విశాల తిరుపతి సహకార సంఘాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేసారు.పంట విస్తీర్ణం బట్టి ఎరువులు రైతులకు అందజేయాలని సహకార సంఘాల కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎరువుల విక్రయాలపై పలు సూచనలు చేశారు.

పంటల విస్తీర్ణం ఆధారంగా రైతులకు  ఎరువులు విక్రయించాలని, రైతుల ఆధార్ కార్డ్, పాస్ పుస్తకము జిరాక్స్ కాపీలను తీసుకొని ఎరువులు విక్రయించాలని, పిఓ మిషన్ ఆధారంగానే   రైతులకు విక్రయించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ ఎం శ్రీనివాస్, సీనియర్ ఇన్స్పెక్టర్ నిజాం, మెట్పల్లి సహకార సంఘ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల వ్యవసాయ అధికారితదితరున్నారు