04-06-2025 12:00:00 AM
నవోదయ పాఠశాల ఏర్పాటుకు భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
గండీడ్ జూన్ 3 : మన ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వరగిరిపల్లి గ్రామ పరిధిలోని అంతరంగ వెనుక భాగంలోని సర్వేనెంబర్ 58లో 20 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి నవోదయ పాఠశాల ఏర్పాటు నిమిత్తం పరిశీలించారు. అనంతరం కపులాపూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.
సర్వే పూర్తి చేసి సంబంధిత అధికారులకు నివేదికను అందజేసినందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రెవెన్యూ సదస్సుల ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అర్హులైన అందరికీ విడుదలవారీగా ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని తెలిపారు.
ఎక్కడ ఎవరికి సమస్య ఉన్న ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా పాలన ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,డిటి మాధవి, తదితరులు పాల్గొన్నారు.