30 June, 2026 | 11:56 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు

18-07-2025 08:36 PM

110 లీటర్ల కల్తీ పాలు 1.1 హైడ్రోజన్ పెరాక్సైడ్ స్వాధీనం

మేడిపల్లి: కల్తీ పాల స్థావరంపై ఎస్ఓటి పోలీసులు 110 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్న స్థావరంపై దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడిపల్లి  పరిధిలోని పర్వతాపురం , సాయి మహదేవ్ నగర్ లో అక్రమంగా హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ తో  కల్తీ పాలు తయారు చేస్తున్న మురళీకృష్ణ రెడ్డి ఇంటిపై మల్కాజ్గిరి కి చెందిన ఎస్ ఓ టి పోలీసులు  ఏఎస్ఐలు మల్లేష్, నాగేందర్ , స్థానిక పోలీసులు శుక్రవారం దాడి చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బాధితుని ఇంట్లో 110 లీటర్ల కల్తీ పాలు 1.1 లీటర్ల హైడ్రోజన్ ఫెరాక్సైడ్, 19 గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకొని బాధితుడు  మురళీకృష్ణారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.