1 April, 2026 | 1:10 AM

గవర్నర్‌తో స్పీకర్, మండలి చైర్మన్, సీఎస్ భేటీ

03-07-2024 12:46 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): గవర్నర్ రాధాకృష్ణన్‌తో శాసనసభాపతి ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకా ర్యదర్శి శాంతికుమారి భేటీ అయ్యారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో స్పీకర్, మండలి చైర్మన్, సీఎస్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.