24-09-2025 11:45:40 PM
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్
జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి
శివంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట మండల కేంద్రంలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి అమ్మవారిప్రత్యేక పూజలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నాము అని అన్నారు.