30 June, 2026 | 11:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం

12-05-2026 07:54 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులకు రెమిడీయల్ ప్రత్యేక శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా పరిశీలకులు హరికృష్ణ, శ్రవణ్ కుమార్ శిక్షణ కేంద్రంను సందర్శించి మాట్లాడినారు.

కోదాడ నియోజకవర్గం 5 మండలాల కోదాడ, అనంతగిరి, చిలుకూరు, మునగాల, నడిగూడెం సంబంధించి పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు వ్రాయునన్న విద్యార్థులు రెమిడీలు శిక్షణా తరగతులకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈనెల 12  నుంచి జూన్ మూడవ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కాల నిర్ణయ పట్టిక ప్రకారం వివిధ సబ్జెక్టులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపినారు.