05-04-2025 03:59:57 PM
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శనివారం శ్రీలంకలో మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం మిత్ర(Mitra Vibhushana award) విభూషణను అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, రెండు దేశాల ఉమ్మడి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన కృషికి గౌరవంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే(Sri lankan president Anura Kumara Dissanayake) ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు. "శ్రీలంక ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం శ్రీలంక మిత్ర విభూషణను ప్రదానం చేయాలని నిర్ణయించిందని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను. ప్రధానమంత్రి మోదీ ఈ గౌరవానికి ఎంతో అర్హులు. అదే మేము దృఢంగా నమ్ముతున్నాము" అని అధ్యక్షుడు కుమార దిసనాయకే అన్నారు.
ఈ అవార్డును అందుకున్న ప్రధాని మోదీ, ఇది తనకు గర్వించదగ్గ విషయం అన్నారు. "ఈ రోజు, అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే చేతుల మీదుగా శ్రీలంక మిత్ర విభూషణ్ అవార్డుతో సత్కరించబడటం నాకు కాదు, 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. ఇది శ్రీలంక, భారతదేశ ప్రజల మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని, లోతైన స్నేహాన్ని చూపిస్తోందన్నారు. దీనికి నేను అధ్యక్షుడికి, శ్రీలంక ప్రభుత్వానికి, ఇక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ప్రధాని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు.