13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఎస్‌ఆర్ నగర్ సీఐగా శ్రీనివాస్‌రెడ్డి

20-01-2026 12:00 AM

సనత్‌గర్, జనవరి 19 (విజయక్రాంతి): నూతనంగా నియమితులైన సర్కిల్ ఇన్‌స్పె క్టర్ డీ. శ్రీనివాస్ రెడ్డి సోమవారం సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితిపై ఆయన పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ నేరాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ సమస్యలపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.