07-06-2025 11:08:30 PM
విద్యా వైద్య రంగానికి రూ 223.42 కోట్ల పనులు..
800 మెగావాట్ల ప్లాంటు, రాగి గనులు, ఎయిర్పోర్ట్ ఏర్పాటయ్య వరకు విశ్రమించను..
విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సాంబశివరావు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అధికార పార్టీ మంత్రి నియోజకవర్గం రీతిలో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. శనివారం పాల్వంచ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన ఏడాదిన్నర పాలనలో అనేక అంశాలను ప్రజలముందు ఉంచారు. నియోజకవర్గంలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. విద్య వైద్య రంగానికి రూ 223.42 కోట్ల ఇప్పటికే వెచ్చించామని, ఇంకా రూ 47.87 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.
కొత్తగూడెం కార్పొరేషన్, ఎర్త్ యూనివర్సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు ప్రధానమైన మైలురాళ్లు అన్నారు. పర్యాటక రంగం క్రీడారంగంలో నియోజకవర్గాన్ని అగ్ర భాగంలో నిలుపుతానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ,ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ ద్వారా పాల్వంచ గిరిజన చట్టాలకు ఎలాంటి ముప్పు వాటిల్ల బోధని పాల్వంచ ఐడెంటిటీ కాపాడే బాధ్యత తనదన్నారు.
కొత్తగూడెంలో ఆగిపోయిన జీవో నెంబర్ 76 త్వరలో అమలు చేస్తామని, పాల్వంచ లోని 444, 727, 817, 999 సర్వే నెంబర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుందన్నారు. నియోజకవర్గంలో జర్నలిస్టులకు బిపిఎల్ కింద ఇంటి స్థలాల కేటాయించి తీరుతానన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షామీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబా, మండల కార్యదర్శి వేషం శెట్టి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.