10-05-2025 01:43:12 AM
సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
గట్టుప్పల, మే 9 (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మావోయిస్టులపై కాల్పులు ఆపి శాంతి చర్చలు జరపాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కేంద్రం బూటకపు ఎన్ కౌంటర్ల ద్వారా మావోయిస్టులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం సిగ్గుచేటని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
మావోయిస్టులు తమ సిద్ధాంతాల ప్రకారం అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ప్రజలను దోపిడి వ్యవస్థను దోచుకుంటున్న వేల, కాపాడాల్సిన వారు కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితులలో ప్రశ్నిస్తున్న మావోయిస్టులను కాల్చి చంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రభుత్వాలు ప్రజల హక్కుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఆ హక్కుల కోసం పోరాడే వారిని శత్రువులుగా చూడడం సరి కాదని ఆయన అన్నారు. ఆర్థిక, సామాజిక అంతరాలను తగ్గించే పద్ధతిలో పనిచేయాలని ఆయన అన్నారు. దేశ పౌరులను శత్రువులుగా పరిగణించే వైఖరిని మార్చుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కర్రెగుట్టలో కూంబింగ్ ఆపి శాంతి చర్చలు జరపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య,సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బల్లెం స్వామి, నరసింహ, యాదయ్య పాల్గొన్నారు.