17-05-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 16 (విజయ క్రాంతి) : వడ్డించేవాడు మనవాడు అయితే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటి... అన్న చం దాన ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ కార్యాలయపు అధికారి పనితీరు. విద్యాశాఖలో వింత పోకడలు సాగుతున్న ట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. లేని పోస్టుల్లో అన్యాయులకు ప్రత్యేకంగా డెప్టేషన్ లపై ఆర్డర్లు ఇవ్వడం ఉపాధ్యాయ వర్గాన్ని వి స్మయానికి గురిచేస్తోంది.
ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సేవలు అందించాల్సిన కొందరు ఉపాధ్యాయులు దర్జాగా పట్టణ ప్రాంతాలకు, జిల్లా కేంద్రాలకు పరిమితం అ వుతున్నారు. ఏళ్ల తరబడి అసలు ఉద్యోగమైన పవిత్ర ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిం చకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పకుం డా ఆయా పోస్టుల్లో కార్యాయాలకు పరిమితం అవుతున్నారు.
విశ్వాసనీయ సమా చారం మేరకు దమ్ము గూడా మండలంలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తూ పాల్వంచకు చెందిన ఓ ఉపాధ్యాయుడు సంవత్సరాల కొ ద్దీ జిల్లా కార్యాలయంలోనే ఉండిపోవడం. చేతబత్యాలు మాత్రం దమ్ముగూడెం మండ లం నుంచి పొందటం కొసమెరుపు.
2024లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన దమ్ము కూడా మండలంలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్కు పోస్టు లేని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా నియమించినట్టు తెలుస్తోంది. జిల్లాలో అసలు ఆ పోస్టు లేదు. మరి నియామకం ఎలా జరిగిందని పోలవరం ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ఇది ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధమని తప్పనిసరిగా విధులకు పంపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఎంద రో సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, ఒక జూనియర్ ఉపాధ్యాయానికి లేని పోస్టు కట్టబెట్టడం జిల్లా విద్యాశాఖాధికారి పనితీరుకు చక్కని నిదర్శనం.
ఇదిలా ఉండగా ఎందరో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఉండగా, అసిస్టెంట్ కమిషనర్, డి సి ఈ బి కార్యదర్శి కి ఓకే ప్రధానోపాధ్యాయులు కొనసాగడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి ఆధిపత్యం కోసం వారు తమ తమ అనుకూల పనులు చేసుకోవడంతో నేడు జిల్లా విద్యాశాఖ బ్రష్టు పడుతోందని ఆరోపణలు వెలబడుతున్నా యి.
ఇదెలా ఉంటే ఇల్లందు మండలం మర్రిగూడెం పాఠశాల ఉపాధ్యాయుడు గత రెండు సంవత్సరాలుగా విధులకు గైరహాజరవ్వడమే కాకుండా, పాఠశాల నిధుల అక్రమాలకు పాల్పడినట్లు అనేక ఫిర్యాదుల డీఈఓ కార్యాలయానికి అందాయి. సదరు డీఈవో గత రెండు సంవత్సరాల నుంచి పలుమార్లు విచారణ చేపట్టారు తప్ప ఆ ఉపాధ్యాయుడు పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ముచ్చటగా మూడోసారి మర్రిగూడెం వెళ్లిన విచారణ అధికారిని గ్రామస్తులు ఎన్నిసార్లు విచారణలు చేస్తారని ప్రశ్నించడం కోసమెరుపు. ఇవి కేవలం డీఈవో పనితీరుకు మచ్చుతునకలు మాత్రమే.. వెలుగు చూడని అనేక నిబంధనల వ్యతిరేక కార్యక్రమాలు కోకోలలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ కమిషనర్ కొత్తగూడెం డిఈఓ పనితీరుపై విచారణ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వాస్తవంగా ఎవరినైనా ఒక విధుల్లోకి డిప్యూటేషన్ చేసే సమయంలో ఆ పోస్టుకు ఉన్నత స్థాయి నుంచి అనుమతి తీసుకొని, నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేస్తే అర్హతలను బట్టి నియమించాల్సి ఉంది. ఈ రెండు పోస్టులకు గుట్టు చప్పుడు కాకుం డా, ఎవరికీ తెలియకుండా లోపాయకారంగా అనుకూలమైన వ్యక్తులతో భర్తీ చేసిన ట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.
ప్రత్యేక చొరవతో..
ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారిని వివరణ కోరగా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్ట్, అసిస్టెంట్ కమిషనర్, డిసిఇబి పోస్ట్లు కొత్త జిల్లాకు మంజూరు కాలేదని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో పని చేయించేందుకు వారిని డిప్యూటేషన్గా తీసుకున్నారని తెలిపారు.