17-05-2025 12:00:00 AM
సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి
దేవరకొండ, మే 16: దేవరకొండలో శుక్రవారం నియోజకవర్గ సిపిఐ కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాలతో కష్టపడి పండించిన పంట నీటి పాలు అవుతూ రైతుల ఆవేదన చెందుతున్నారని ఐకెపి కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు మరింత వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం అయిందని, దేశాన్ని కార్పొరేట్ లకు తాకట్టు పెట్టి దివాళా తీయించిందని అన్నారు. మోడీ నమ్మిన బంటు ఆదానీకి ప్రభుత్వ రంగ సంస్థలను దోచి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వానిది నిర్లక్ష్య వైఖరి ఆవలంబిస్తుందని , విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు అండగా నిలిచి సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహ రెడ్డి ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు దేప సుదర్శన్ రెడ్డి వెంకటయ్య, కే జయ రాములు తదితరులు పాల్గొన్నారు.