పగలూ వెలుగులు విరజిమ్ముతున్న వీధి దీపాలు
30-03-2026 02:06 AM
ఇల్లందు టౌన్, మార్చి 29 (విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 21వ వార్డులో అసమాన పరిస్థితి నెలకొంది. కొన్ని వీధుల్లో పగలే 24 గంటలు వీధి దీపాలు వెలుగులు విరజిమ్ముతుండగా, అదే వార్డులోని మరికొన్ని వీధుల్లో కనీసం విద్యుత్ స్తంభాలు, లైట్లు లేక ప్రజలు చీకట్లోనే జీవనం సాగిస్తున్నారు. గతంలో ఈ సమస్యపై వార్తలు ప్రచురించినప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం పై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను గుర్తించి అన్ని వీధుల్లో సమానంగా లైట్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.




