28-06-2025 11:21:21 PM
కోదాడ: మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మహాన్యూస్ ప్రధాన కార్యాలయం పై బిఆర్ఎస్ గుండాల దాడిని ఖండిస్తున్నాము అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో కేటీఆర్ పాత్ర పై సిట్ దర్యాప్తు లో తెలినందున దానిని మహా న్యూస్ ప్రసారం చేస్తున్న సందర్భం లో బిఆర్ఎస్ శ్రేణులు మహా న్యూస్ కార్యాలయం పై దాడి చేసి ఆఫీస్ లోని ఉద్యోగులను కొట్టి ,ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసము చేయడం ప్రజాస్వామ్యలో ఇది పత్రిక స్వేచ్చ కు గొడ్డలి పెట్టు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నియంత్రుత్వ పోకడలకు ప్రజలు బుద్ది చెప్పినా మార్పు రాకపోవడం శోచనియం అన్నారు.
దీన్ని ప్రజా స్వామ్య వాదులంతా ఖండించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ముక్త కంఠం తో తెలియజేస్తూ నిందుతలపై తక్షణమే కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి కొల్లు నర్సయ్య, సీనియర్ నాయకులు సాతులూరి గురవయ్య, నడిగూడెం మండల పార్టీ అధ్యక్షులు గుండు నాగేశ్వరావు, చిలుకూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లు సత్యనారాయణ, అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు చాపల శ్రీనివాసరావు, కోదాడ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల శోభన్ బాబు, కోదాడ పట్టణ పార్టీ అధ్యక్షులు ఉప్పగండ్ల శ్రీనివాస రావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టికూటి సైదయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి టేకుమట్ల దుర్గారావు, సజ్జా రామ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.