calender_icon.png 29 June, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం

28-06-2025 11:24:00 PM

ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలను ఐక్యం చేయాలి

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): మతోన్మాద కార్పొరేట్ రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మంచి కంటి భవన్లో కొత్తగూడెం పట్టణ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు రెండు రోజులపాటు జరగనున్న నేపథ్యంలో మొదటి రోజు క్లాసులు ప్రారంభిస్తూ ఏజే రమేష్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలను ఐక్యం చేయాలని, మతం పేరుతో జరిగే విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాల్లోకి తీసుకురావాలన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రజల దైనందిన సమస్యలు వెలుగులోకి రాకుండా ప్రజలు వాటిపై ప్రశ్నించకుండా మతం పేరుతో ప్రజలను విభజించు పాలించు అని బ్రిటిష్ విధానాన్ని అమలు చేస్తుందని విమర్శించారు.

 మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటం అంటే ప్రజలు మతం వైపు వెళుతున్న పరిస్థితులపై వారి సమస్యలపై పోరాటం ద్వారా మత ఉన్మాద విధానాలను ఎండగట్టొచ్చని చెప్పారు. ఈ క్లాసులకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. మొదటిరోజు మతం మతోన్మాదం మరియు సిపిఎం విశిష్టత క్లాసులను టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ బోధించారు. ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు సందకూరి లక్ష్మి నందిపాటి రమేష్ నాయకులు జునుమాల నగేష్ ఆవుల శ్రీరాములు ఆలేటి శ్రీను అన్నవరపు ఇందిరా పప్పుల ప్రమోద్ వాణి గడల నరసింహారావు పద్మ రజిత బాలకృష్ణ రాములు రఘు రమ నాగదుర్గ సంధ్య తదితరులు పాల్గొన్నారు.