29-05-2025 01:19:15 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే28: రైతులకు నకిలీ విత్తనాలు,పురుగుమందులను అమ్మితే చట్టరిత్యా చర్యలు తప్పవని,ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలు,ఎరువులనే అమ్మాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,అదనపు కలెక్టర్ రాంబాబులు విత్తన డీలర్లను హెచ్చరించారు.
బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని మన గ్రోమోర్ సెంటర్,ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం ఎరువుల దుకాణాన్ని వేర్వేరుగా ఆకస్మికంగా తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాలం సీజన్ సమీపిస్తున్నందున రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించకుండా ముందస్తుగా తనిఖీలు జరిపినట్లు తెలిపారు.
నాణ్యమైన విత్తనాలు,ఎరువులను రైతులకు అందించాలని,ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి ఎంఆర్పీ ధరకన్నా ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.వానాకాలం సీజన్ కు సరిపడా విత్తనాలు,ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయాధికారులకు సూచించారు.
అనంతరం రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి,ఆర్డీఓ వేణుమాధవరావు,ఎంపీడీఓ గోపి,తహశీల్దార్ చిప్పలపల్లి యాదగిరి,ఏఓ గణేష్ ఉన్నారు.