29-05-2025 01:17:38 AM
కలెక్టర్ ఎం హనుమంతరావు హెచ్చరిక
యాదాద్రి భువనగిరి మే 28 ( విజయక్రాంతి ) : జిల్లాలో కల్తీ ఎరువులు, నకిలీ విత్తనాలు అమ్మిన, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ అనుసంధానంతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని ఎరువుల డీలర్స్ , విత్తన డీలర్స్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, తో ఆయిల్ ఫామ్ సాగుపై రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వాన కాలం సీజన్ ప్రారంభమవుతున్నందున అందుకు అనుకూలంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం ఈ-పాస్ మిషన్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డీలర్లకు అందజేశారు. ఆయిల్ ఫామ్ సాగు అనే పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి,ఎ డి ఎ నీలిమ, మండల వ్యవసాయ అధికారులు,డీలర్లు తదితరులు పాల్గొన్నారు.