27 February, 2026 | 1:03 PM

ఢిల్లీ జేఎన్‌యూలో తీవ్ర ఉద్రిక్తత

27-02-2026 11:26 AM

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (Jawaharlal Nehru University)లో శుక్రవారం తెల్లవారుజామున నిరసనలు తీవ్రమయ్యాయి. విద్యార్థుల ర్యాలీ సందర్భంగా హింస చెలరేగిన తరువాత పోలీసులు అనేక మంది అరెస్టులను నిర్ధారించారు. జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ (Jawaharlal Nehru University Students' Union) నిరసనలకు సంబంధించిన హింసకు సంబంధించి ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు(Delhi Police) తెలిపారు. అరెస్టయిన వారిలో జెఎన్‌యుఎస్‌యు మాజీ అధ్యక్షుడు నితీష్ కుమార్, ప్రస్తుత అధ్యక్షురాలు అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలు గోపికా బాబు, జాయింట్ సెక్రటరీ డానిష్ అలీ ఉన్నారని అధికారులు వెల్లడించారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (University Grants Commission) నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు విద్యా మంత్రిత్వ శాఖకు లాంగ్ మార్చ్(Long March) చేయడానికి ప్రయత్నించిన తర్వాత పోలీసులు జేఎన్‌యూలో క్యాంపస్‌ను దిగ్బంధించారు. యూనివర్సిటీ పరిపాలన ఈ మార్చ్‌కు అనుమతి నిరాకరించిందని, విద్యార్థులు క్యాంపస్ నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు నిరసన హింసాత్మకంగా మారిందని పోలీసులు ప్రకటించారు. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఘటనకు బాధ్యులుగా 50 మంది విద్యార్థులను అధికారులు డిటైన్డ్ చేశారు.