01-07-2025 12:28:54 AM
హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
ఎల్బీనగర్, జూన్ 30 : విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాల కు చేరాలని కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి సూచించారు. కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి తన తండ్రి పెంటారెడ్డి 4వ వర్ధంతిని పురస్కరించుకొని హయత్ నగర్ ఉన్నత పాఠశా లలో సోమవారం పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బ హుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు బాగా కష్టపడి చదవా లని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు రాలు రమాదేవి, కళ్లెం శంకర్ రెడ్డి, కళ్లెం జయవర్ధన్ రెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నక్క దర్శన్ గౌడ్, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.