8 June, 2026 | 6:20 PM

Breaking News

జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •  

పట్టుదలతో చదివి ఉన్నతంగా ఎదగాలి

01-08-2024 12:29 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, జూలై 31: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని హనుమాన్ నగర్‌లో జడ్పీహెచ్‌ఎస్, గిరినగర్‌లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. గిరినగర్ పీహెచ్‌సీలోని రిజిస్టర్‌ను పరిశీలించి, అన్ని రకాల పరీక్షలు చేసి మందులు పంపిణీ ఇస్తున్నారా అని రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ అన్నింటిని టీ హబ్‌కు రెగ్యులర్‌గా పంపుతున్నారా అని ఆరా తీశారు.

అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. హనుమాన్ నగర్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌ను పరిశీలించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించారు. పదో తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. పదో తరగతిలో 10/10 జీపీఏను సాధించేలా చదవాలన్నారు. ఆయన వెంట హెచ్‌ఎం యతిపతిరావు, ఉపాధ్యాయుడు ఎండి గౌస్, మెడికల్ ఆఫీసర్ శివప్రసాద్, వైద్యసిబ్బంది ఉన్నారు.