బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి
11-03-2026 12:33 AM
మేడ్చల్, మార్చి 10 (విజయ క్రాంతి): బాలికలు బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఉచితంగా అందజేసిన 100 సైకిళ్లు బాలికలకు కలెక్టర్ పంపిణీ చేశారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలలో చదువుతూ వంద శాతం హాజరు ఉన్న బాలికలకు మంజూరు చేసి, మంగళవారం 21 మంది విద్యార్దినులకు సైకిళ్లను అందజేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎస్బిఐరీజినల్ మేనేజర్, డిఈఓ విజయ కుమారి, విద్యార్థనులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




