calender_icon.png 6 February, 2026 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఆలయ ఏఈఓగా వీధుల్లో చేరిన సుదర్శన్

06-02-2026 12:59:46 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారిగా ఆర్ సుదర్శన్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 2019 లో మల్లన్న ఆలయంలో ఏఈఓ గా విధులు నిర్వహిస్తూ, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి డిప్యూటేషన్ పై వెళ్లారు. దేవాదాయ శాఖ కమిషనర్ డిప్యూటేషన్ రద్దు చేస్తూ, తిరిగి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం రోజు సుదర్శన్ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనములు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాణా అధికారి టంకశాల వెంకటేష్, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, చిన్న మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ ఆలయ సిబ్బంది, మ శంకర్ శర్మ, మధుకర్, సిద్దయ్య, నర్సింలు తదితరులు ఉన్నారు.