11-12-2025 12:00:00 AM
డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ యొక్క వార్డు పరిమితుల పునర్ నిర్మాణము (డీలిమిటేషన్ అఫ్ వార్ట్స్)కు సంబం ధించిన ముసాయిదా ప్రకటన (డ్రాఫ్ట్ పబ్లికేషన్) బుధవారం బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఫామ్ -1 ద్వారా డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజా విడుదల చేయడం జరిగింది.
ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడానికి ఈ ముసాయిదా ప్రచురించారని, కొత్తగా ప్రతిపాదించిన 300 వార్డు లకు సంబంధించిన ముసాయిదా ప్రకటన బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. పౌరులు తమ సూచన లు, అభ్యంతరాలు లిఖిత పూర్వకంగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈనెల16లోగా ఇవ్వాలని, పౌరులు తమ విలువైన అభ్యంతరాలు, సూచనలు అందించాలని డిప్యూటీ కమీషనర్ ఏ.శైలజ తెలిపారు.