24 March, 2026 | 8:33 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

పాత నేరస్తులపై నిఘా పెంచాలి

18-04-2025 12:00 AM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి), జిల్లాలో పాత నేరస్థులపై నిఘాను పెంచాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీస్ సిబ్బంది వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఆ ప్రమత్తంగా వివరించాలని తెలిపారు.