04-06-2025 10:37:32 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా భూభారతి చట్టంలో సర్వే నిర్వహించడానికి శిక్షణకు ఎంపిక చేసిన సర్వేయర్లకు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ వి.దీపిక(Rural SI V. Deepika) మాట్లాడుతూ... సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పర్యటించే సమయంలో రైతులకు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మ్యాట్రిమోనియల్, ఓటిపి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగే మోసాలపై వివరించారు.