21-06-2025 01:54:45 AM
న్యూఢిల్లీ, జూన్ 20: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేపట్టాల్సి ఉండగా, యాక్సియం-4 ప్ర యోగాన్ని వాయిదా వేస్తున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది. ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించింది.
యాక్సి యం--4 ద్వారా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు అం తరిక్ష యాత్ర చేయనున్నారు. అమెరికా కు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సి యం స్పేస్ ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోసా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇం దులో భాగస్వామ్యం వహిస్తున్నాయి.
ఇందులో శుభాంశు మిషన్ పైలెట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వివిధ కారణాల వల్ల పలుసార్లు ప్రయోగాన్ని వాయిదా వేశారు.