calender_icon.png 21 June, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్

21-06-2025 01:54:45 AM

  1. ఆరోసారి ప్రయాణాన్ని వాయిదా వేసిన నాసా
  2. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, జూన్ 20: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్లా అంతరిక్ష యాత్ర ఆరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న శుభాంశు రోదసి యాత్ర చేపట్టాల్సి ఉండగా, యాక్సియం-4 ప్ర యోగాన్ని వాయిదా వేస్తున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది. ప్రయోగానికి సంబంధించి కొత్త తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించింది.

యాక్సి యం--4 ద్వారా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు అం తరిక్ష యాత్ర చేయనున్నారు. అమెరికా కు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సి యం స్పేస్ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోసా అంతరిక్ష సంస్థ ఈఎస్‌ఏలు ఇం దులో భాగస్వామ్యం వహిస్తున్నాయి.

ఇందులో శుభాంశు మిషన్ పైలెట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వివిధ కారణాల వల్ల పలుసార్లు ప్రయోగాన్ని వాయిదా వేశారు.