21-06-2025 01:49:12 AM
స్ఫూర్తిగా నిలుస్తున్న యోగా మాస్టర్ యమున
యోగా డే స్పెషల్
కరీంనగర్, జూన్ 20 (విజయ క్రాంతి): యోగాలో కరీంనగర్ జిల్లాకు చెందిన యో గా మాస్టర్ యమున మేటిగా నిలుస్తున్నది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుననప్పటికి సంక ల్ప బలంతో ముందుకుసాగుతూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నది. నిరంతరం సాధ నతో యోగాలో నైపుణ్యాన్ని సాధించి రాష్ట్ర, జాతీయ వేదికలపై జరిగిన పోటీల్లో పతకాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి పేరుకు తీసు కువస్తున్నది.
ఆమె కరీంనగర్ జిల్లాలోని దుర్శేడ్ గ్రామంలోని పేద కుటుంబంలో జ న్మించింది. 6వ తరగతి చదువుతున్న సయం లో యోగా క్రీడపట్ల ఆకర్షితురాలైన యము న కోచ్ దివిటి సత్యనారాయణ శిక్షణలో తక్కువ కాలంలోనే యోగాననాల ప్రదర్శనలో రాటుదేలి పోటీలపై ధ్యాన నిలిపింది. తొలిసారి నిజామాబాద్లో 2002లో జరిగిన రాష్ట్ర పోటీల్లో పాల్గొని ఓటమి చెందగా, ఆ మెలో పట్టుదలను పెంచింది.
యమున ఆసక్తిని, పట్టుదలను గమనించిన జిల్లా యోగా అసోసియేషన్ ప్రోత్సాహంతో యోగాలో మెరుగైన నైపుణ్యాన్ని సాధించింది. అప్పటి నుంచి పోటీల్లో తిరుగులేని ప్రతిభతో ఆమె రికార్డులు బ్రేక్ చేసింది. ఆయా యోగా పోటీ ల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆమె సాధించిన పతకాలే జిల్లా యోగా క్రీడా రంగానికి ప్రథమం. దీంతో తన ఊరు పేరునే కాదు జి ల్లా పేరును కూడా ప్రపంచానికి చాటింది.
యమున తల్లి అయిన బుర్ర సత్తమ్మకు ఇద్ద రు కూతుళ్లు. చిన్న కూతురైన యమున 10 సంవత్సరాలు ఉండగా సత్తమ్మ భర్త కనకయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే పెద్ద కూతురుకు పెళ్లి జరిగింది. చిన్న కూతురుకు చదువుపై శ్రద్ధ ఉండదం తో కూలి పనిచేసుకుం టూ యమునను చదివించింది. యమునకు యోగా కోర్సు ఇష్టం కావడంతో కష్టపడి అప్పు చేసి చదివించడంతో యమున యోగాలో మాస్టర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసింది.
2003 నుంచి నేటి వర కు పలు రాష్ట్రాల్లో జరిగిన జాతీయ పోటీల్లో అలుపెరగకుండా పాల్గొంటూ పసిడి పతకాలు సాధిస్తూ ఆయా వేదికలపై విజయబా వుటా ఎగురవేసింది. తనకు ఇష్టమైన రంగం లో రాణించి జిల్లాకు ఖండాంతర ఖ్యాతిని తేవాలన్న ఆమె ఆసక్తిని ఆర్ధిక పరిస్థితులు నీరుగార్చినా, మొక్కవోని ఆత్మవిశ్వా సంతో యమున అనుకున్నది సాధించింది. తొలుత లాస్ ఏంజిల్స్ లో జరిగిన అందర్-18 అంతర్జాతీయ స్థాయి యోగా చాంపి యన్షిప్ పోటీలకు ఆమె ఎంపికయింది. దురదృష్టవశాత్తు వీసా లభించని కారణంగా వెళ్లలేక పోయింది.
సమస్యను చూసి నిరాశ చెందకుండా, వెనుకడుగు వేయకుండా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే మరో అవకాశం కోసం తీవ్రంగా శ్రమించి, తన యోగా ప్రదర్శనలతో ఔ రా అనిపించింది. కేవలం చైనాలోనే కాకుండా పలు దేశాల్లో శిక్షణ ఇచ్చిన యమున, ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ లో యోగా సెంటర్ను ఏర్పాటు చేసి ఆసక్తిగల వారికి శిక్షణ ఇస్తున్నది.
సెలబ్రిటీలు, సినీ తారలు, క్రీడాకారు లు యమున వద్దకు యోగా నేర్చుకునేందుకు క్యూ కడుతుంటారు. పల్లెనుంచి జాతీ య, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి అందరికి స్ఫూర్తిగానిలుస్తున్నది.