calender_icon.png 10 February, 2026 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13 మంది బీజేపీ రెబల్స్‌పై సస్పెన్షన్ వేటు

10-02-2026 12:49:23 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): పార్టీ నియమ నిబంధనలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల నుంచి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసిన మొత్తం 13 మంది అభ్యర్థులను సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. వారం రోజుల్లోపు రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని కోరారు.