26-11-2025 12:00:00 AM
-ఫిబ్రవరి 15న భారత్, పాక్ మ్యాచ్
- షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
ముంబై, నవంబర్ 25 : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ , హర్మ న్ ప్రీత్ కౌర్ షెడ్యూల్ను విడుదల చే సారు. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండగా.. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. భారత్లో ఢిల్లీ, కో ల్కత్తా, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, శ్రీలంకలో క్యాండీ, కొలంబో లోని ప్రేమదాస స్టేడియం, సింహల్సే స్పో ర్ట్స్ క్లబ్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు.
మార్చి 8న అహ్మదాబాద్లో ఫైనల్ జరుగుతుంది. ఊహించిట్టుగానే చిరకాల ప్రత్యర్థు లు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులో చోటు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 15న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. కొలం బో ఆతిథ్యమివ్వనుం ది. భారత్కు వచ్చేందుకు పాక్ నిరాకరించడంతో ఆ జట్టు ఆడబోయే మ్యాచ్లన్నీ కొలంబోలోనే జరుగుతాయి. కాగా గ్రూప్ ఏలో భారత్, పాకి స్థాన్ జట్లతో పాటు నెదర్లాండ్స్, నమీబి యా, యూఎస్ఏ చోటు దక్కించుకున్నాయి. టోర్నీ ఆరంభమయ్యే రోజు ఫిబ్రవరి 7న భారత్, యూఎస్ఏ తలపడనున్నాయి.
గత ఎడిషన్ తరహాలోనే ఈ సారి కూడా 20 జట్లు పోటీపడుతున్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్ క్వాలిఫై కానున్నాయి. సూపర్ స్టేజ్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. పాకిస్థాన్ సెమీస్, ఫైనల్స్కు చేరితే మాత్రం వేదిక కొలంబోకు మారే అవకాశముంది. ఈ మెగాటోర్నీకి భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నట్టు ఐసీసీ ఛైర్మన్ జైషా ప్రకటించారు.
గ్రూప్ ఏ : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ
గ్రూప్ బి : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబా బ్వే, ఐర్లాండ్, ఒమన్
గ్రూప్ సి : ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
గ్రూప్ డి : సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా
టీ20 ప్రపంచకప్లో భారత్ షెడ్యూల్ :
ఫిబ్రవరి 7 భారత్ X యూఎస్ఎ (వేదిక : ముంబై )
ఫిబ్రవరి 12 భారత్ X నమీబియా ( వేదిక : ఢిల్లీ )
ఫిబ్రవరి 15 భారత్ X పాకిస్థాన్ ( వేదిక : కొలంబో )
ఫిబ్రవరి 18 భారత్ X నెదర్లాండ్స్ ( వేదిక : అహ్మదాబాద్)