27-09-2025 09:05:33 PM
మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను
చిట్యాల,(విజయక్రాంతి): మధ్యలో చదువు మానేసిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ నందు టెన్త్, ఇంటర్ లో అడ్మిషన్స్ పొంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శనివారం మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను అధ్యక్షతన తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఆర్పీలు, సిబ్బంది తో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మున్సిపల్ పరిధిలో ఆర్ధిక ఇబ్బందుల వల్ల, అనివార్య కారణాల వలన మధ్యలో చదువు మానేసిన, పదవ తరగతి ఫెయిల్ అయిన, పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ చదవలేకపోయినా, ఇంటర్ ఫెయిల్ అయిన వారిని గుర్తించి వారిని ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ లో చేరే విధంగా బాధ్యత వహించాలని తెలిపారు. మండల విద్యాధికారి పి.సైదా నాయక్ మాట్లాడుతూ బడి మానేసిన వారిని, పదవ తరగతి ఫెయిల్ అయిన, ఇంటర్ ఫెయిల్ అయిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ నందు అడ్మిషన్ పొందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
అదేవిధంగా 31 ఆగస్టు 2025 నాటికి ఓపెన్ టెన్త్ కు 14 సంవత్సరాలు, ఓపెన్ ఇంటర్ కు 15 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులు అని ఓపెన్ టెన్త్ రాయాల్సిన వాళ్లు వారు ఏ తరగతి వరకు చదివారో ఆ తరగతికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఓపెన్ ఇంటర్ కొరకు పదవ తరగతి పాస్ మెమో, ఒరిజినల్ టి సి, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలని. ఓపెన్ స్కూల్ ద్వారా అడ్మిషన్ పొందుటకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2025 వరకు గడవు ఉందన్నారు. మండలంలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ జెడ్పిహెచ్ఎస్ చిన్నకాపర్తి నందు గలదని తెలిపారు. వివరాల కొరకు సెంటర్ సహాయక కోఆర్డినేటర్ చంద్రశేఖర్ యొక్క ఫోన్ నెంబర్: 9441291637 ను సంపాదించాల్సిందిగా తెలిపారు.