15 June, 2026 | 8:39 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

వైద్య ఆరోగ్యశాఖ ఆషాడే

04-11-2025 06:08 PM

రాజన్న సిరిసిల్ల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత రాజన్న సిరిసిల్ల ఆషాడే సందర్భంగా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ నియంత్రణ కార్యక్రమంలో టీబీ వ్యాధిగ్రస్తులకు(పోషకాహార) నిక్షయ్ కిట్టు అందించి, క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి, టీబీ రహిత మండలం చేయాలని సూచించారు. ఆశాడే  కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత వైద్యాధికారితో స్థానిక వైద్యం సిబ్బంది, ఆశలతో కేంద్ర ఆరోగ్య పథకాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వర్షాలు కురుస్తున్నందున డ్రై డే ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహించాలని, జరిపిడితులను గుర్తించి చికిత్స అందించవలసిందిగా, గర్భిణీ స్త్రీలను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి నమోదు, గర్భిణీ చెక్అప్ లు సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేటట్లు ప్రోత్సహించాలని సూచిస్తూ, ఆరోగ్య కేంద్ర పథకాలు లక్ష్యాలు సాధించవలసిందిగా వైద్య సిబ్బందికి, ఆశాలకు దిశా నిర్దేశించినారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారి డాక్టర్ సారియా అంజుము, సి హెచ్ ఓ బాలచంద్రం,  వైద్య సిబ్బంది ఆశాలు పాల్గొన్నారు.