ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది..
04-11-2025 06:05 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన అసరి మల్లయ్య ఆపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన వాళ్ళ కొడుకు వెంటనే 108కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ 108 సిబ్బంది తక్షణమే స్పందించి ఆపస్మారక స్థితిలో ఉన్న మల్లయ్యకు షుగర్ లెవల్స్ పడిపోవడం గమనించిన టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ తక్షణమే డిక్ట్రోజ్ సెలైన్ బాటిల్ ఎక్కించి తగు ప్రథమ చికిత్స చేసి మల్లయ్య ప్రాణాలు కాపాడి కరీంనగర్ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించడం జరిగింది. తక్షణమే ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ, పైలట్ తోటపల్లి రాజేందర్ కు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.






