14-12-2025 10:24:20 PM
ధర్మశాల: ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో సౌతాఫ్రికా(South Africa)పై టీమిండీయా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండీయా(Team India).. 15.5 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో 2-1 తో టీమిండీయా ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా..హర్షిత్ రాణా, హర్షదీప్ చెలరేగడంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.