30-06-2025 12:37:31 AM
కోల్కతా, జూన్ 29: ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టోక్యో నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ కోల్కతా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశాడు.
విమాన కేబిన్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగినట్టు ఎయిరిండియా ప్రకటనలో తెలిపింది. ‘టోక్యోలోని హనేడా నుంచి ఢిల్లీకి వస్తున్న ఏఐ 357 విమానంలో లోపం తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కోల్కతా విమానాశ్రయంలో ల్యాండ్ చేశాం.’ అని తెలిపింది. ప్రయాణికులను ఢిల్లీని చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్టు తెలిపింది.