24-04-2025 01:33:37 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరింనగర్ సమీపంలోని కొత్తపల్లి లో గల తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఏ శ్రీదేవి 466(కరీంనగర్), బి రితిష్ యాదవ్ 466(మంచిర్యాల), ఎం వర్షిత్ 365(హనుమకొండ), ఏ నందీశ్వర్ 464(సంగారెడ్డి), విటల్ 462 (సంగారెడ్డి), సీఈసీ విభాగంలో బి రామ్ చరణ్ 490(సిద్దిపేట), జి రాజేందర్ 483 (మహబూబాబాద్) మార్కులు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఎస్ మారుతి 993(రాజన్న సిరిసిల్ల), బైపీసీలో ఏ పరశురాములు 969(సిద్దిపేట), సీఈసీ విభాగంలో ఎం మనోజ్ కుమార్ 929(నిర్మల్) మార్కులు సాధించాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.