30 April, 2026 | 2:49 AM

టేకులపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల హవా

30-04-2026 01:27 AM

సత్తుపల్లి. ఆర్ సి. ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పెనుబల్లి /టేకులపల్లి: నేడు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో టేకులపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో  U. లోకేశ్వరి 571/600 మార్కులతో మండల ప్రథమ స్థానంలోనూ,N.లావణ్య 562/600 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తాచాటారు.

పివిఎల్ ప్రసన్నకుమారి 550, ఎస్ సంజన 548, ఎస్ దీక్షిత 514,  పి జయ ప్రశాంత్ 513,  జె మహేష్ 506, వి.మానస 5 0 5 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 60 మంది విద్యార్థులకు గాను 56 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ టిబి రూపస్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.