calender_icon.png 25 June, 2025 | 3:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ

25-06-2025 01:55:36 AM

- 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్ మెరిసేలా కొత్త స్పోర్ట్స్ పాలసీ

- వచ్చే ఏడాదిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ

- ఎస్‌ఎల్వీ ప్రో బ్యాడ్మింటన్ స్టేడియం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మా ర్చాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ బ్రాండ్ మెరవాలనే సంకల్పంతోనే కొత్త స్పోర్ట్స్ పాలసీకి శ్రీకారం చుట్టామన్నారు. మంగళవారం నిజాంపేట్ సమతానగర్‌లో ఎస్‌ఎల్వీ ప్రో బ్యాడ్మింటన్ స్టేడియంను ఆయన ప్రా రంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఒకప్పుడు క్రికెట్‌ను మాత్ర మే క్రీడ గా భావించేవారని, ఇప్పుడా పరిస్థితి మారిందన్నారు. ఇతర క్రీడలకు ప్రాధాన్యం పెరిగిం దని, తల్లిదండ్రుల ఆలోచన తీరులోనూ మార్పు వచ్చిందని వివరించారు. గోపీచంద్, సైనా నెహ్వాల్, పీవీ సింధూ, చిరాగ్, సాత్విక్ లాంటి ప్రముఖ క్రీడాకారులు హైదరాబాద్ నుంచే ప్రయాణాన్ని ప్రారంభించారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది చిన్నారులు బ్యా డ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ప్రతిభ చూపిస్తున్నారని తెలిపారు.

బ్యా డ్మింటన్ హబ్‌గా హైదరాబాద్ మారడంలో గోపీచంద్ పాత్ర కీలకమని చెప్పారు. తమ ప్రభుత్వం 2026లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయబోతున్నామని, త్వరలో గచ్చిబౌలీలో బాలికల కోసం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అకాడమీని ప్రారంభించబోతున్నా మని ప్రకటించారు.

రాష్ర్టంలోని పది ఉమ్మడి జిల్లా ల్లో స్పోర్ట్స్ స్కూల్స్‌ను ఏర్పా టు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ముం దుకెళ్తున్నామని చెప్పారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా బ్యాడ్మింటన్ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతా ల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని వివరించారు. ఆసక్తి గల క్రీడలో చిన్నారులు రాణిం చేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.