calender_icon.png 25 June, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీఎం అంతర్రాష్ట్ర దొంగలముఠా అరెస్ట్

25-06-2025 01:56:18 AM

  1. --    24 గంటల్లో ఏటీఎం దొంగల పట్టివేత..
  2. వివరాలు వెల్లడించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్ 

బెల్లంపల్లి అర్బన్, జూన్ 24: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 24 గంటల్లోనే ఏటీఎం చోరీకి యత్నించిన అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పట్టుకునీ బెల్లంపల్లి పోలీసులు తమ సత్తాఏమిటో చాటుకున్నారు. వివరాల ను మంగళవారం బెల్లంపల్లి సీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంచిర్యా ల డీసీపీ ఎగ్గడి భాస్కర్ వెల్లడించారు.

బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి రైల్వే స్టేషన్‌వైపుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఈ నెల 23న తెల్లవారు జాము మూడు గంటల ప్రాం తంలో హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొం గల ముఠా ఏటీఎం గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి దొంగతనానికి యత్నించిందనీ, పోలీస్ సిబ్బం ది దొంగతనానికి యత్నించిన మహమ్మద్ ముస్తఫా, షాహిద్‌లను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. వీరిని బెల్లంపల్లిలోని కెమికల్ ఏరియాలో పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. 

ఐదుగురు సభ్యుల హర్యానా దొంగల ముఠా రెండు బైకులతో గ్యాస్ సిలిండర్ గ్యాస్ కట్టర్ తో బెల్లంపల్లికి వచ్చిందనీ, ముందే వేసుకున్న పథకం ప్రకారం రెక్కిచేసి నిర్మానుషంగా ఉన్న బెల్లంపల్లి కాల్ టాక్స్ ఏటీఎంను దొంగతనానికి ఎంచుకున్నారనీ, వేసుకున్న స్కెచ్ ప్రకారం తెల్లవారు జామున 3 గంటలకు ఏటీఎంను షట్టర్ ఓపెన్ చేసి గ్యాస్ కట్టర్‌తో ఏటీ ఎం బాక్స్‌ను కట్ చేయడం మొదలు పెట్టారని డీసీపీ తెలిపారు.

ఇదే సమయంలో పెట్రోల్ టీం టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్, సాయి కృష్ణ, హోంగార్డు సంపత్ అటుగా సైరన్ తో వెళ్లగా, అది గమనించిన దొంగల ముఠా  అక్కడి నుంచి పారిపోయారన్నారు. పారిపోతూ ఏటీఎం క్యాసెట్ ను కూడా ఎత్తుకెళ్లారనీ, దాని విలువ రూ. 30 వేల వరకు ఉంటుందనీ తెలిపారు.

ఏటీఎం షట్టర్ సగం తెరిచి ఉండటాన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఏటీఎం బాక్స్ కట్ చేసి ఉండటాన్ని గమనించి, అక్కడ దొంగల ముఠా వదిలినా గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్, రెండు బైకులు, కారం పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారన్నారు.

దొంగతనానికి ప్రయత్నించిన విషయాన్ని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ కు సమాచారం అందించడంతో అప్రమత్తమై బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దిన్, టూ టౌన్ ఎస్‌ఐ  మహేందర్, నెన్నల ఎస్‌ఐ ప్రసాద్ ల తో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దొంగల ముఠా కోసం గాలింపు చేపట్టారు. 

చోరీచేసిన బైక్‌లతోనే...

ఏటీఎం దొంగతనానికి ముందుగానే దొంగల ముఠా మహారాష్ట్రకు చెందిన పల్సర్ బైక్, మంచిర్యాలలో మరో బైకును దొంగలించారని డిసిపి భాస్కర్ తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలో గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేశారన్నారు. జెసిబి ఆపరేటర్స్ గా పనిచేస్తున్న మహమ్మద్ ముస్తఫా, షాహిద్ లు తక్కువ సమయంలోనే లక్షల రూపాయలు సంపాదించాలని అత్యాశతో వారి సహచరులు అలీమ్ ఖాన్, సాజిద్, అప్తాబ్ లతో ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారని వెల్లడించారు. 

పరారీలో ఉన్న అలీమ్ ఖాన్, సాజిద్, అప్తాబ్ పట్టుకోడానికి ప్రత్యేక బలగాలు వేటాడుతున్నాయని డిసిపి వివరించారు. హర్యానా దొం గల ముఠా సభ్యుల ఇద్దరినీ పట్టుకోవడంలో ఎంతో సాహసం, చాకచక్యత కనబ రిచిన పోలీసులను డీసీపీ భాస్కర్ అభినందించాడు. నెన్నల ఎస్సై ప్రసాద్, కానిస్టేబుల్ రవీందర్, సాయి కృష్ణ, హోంగార్డు సంపత్‌ను అభినందించి క్యాష్ రివార్డును అందజేశారు. నిర్మా నుషంగా, జనసంచారానికి దూరంగా ఉన్న ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు.