25-06-2025 01:55:20 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూన్ 24 (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.
హైదరాబాద్ బి ఆర్ కే భవన్ నుంచి మంత్రి సీతకుతో పాటు వివిధ శాఖల మొక్క కమిషనర్లు తెలంగాణ హరితహారం ఇందిరమ్మ ఇండ్లు భూభారతి చట్టం సీఏం ఆర్బి ఎం సేకరణ సీజనల్ వ్యాధులు తదితర పథకాలపై సూచనలు చేసినట్టు కలెక్టర్కు వివ రించారు. జిల్లాలో 69.55 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందని, భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ పథకాల పురోభివృద్ధిపై సమీక్ష చేసిన కలెక్టర్ ప్రతి పథకంలో నిర్దేశించిన లక్ష మేరకు పనులు చేయవలసి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ ఫైజాన్ అహ్మద్ అధికారులు నాగాబాను రత్న , గోవిందు, నాగవర్ధన్ పాల్గొన్నారు.