8 April, 2026 | 2:21 AM

గవర్నర్‌ను కలిసిన తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ గోలి

08-04-2026 12:24 AM

రంగారెడ్డి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి ): రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులు ఆనంద్ మరియు భారతితో కలిసి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ఆహార భద్రత మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ (PౄS)పై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ నాణ్యమైన బియ్యం మరియు నిత్యావసర వస్తువులు సకాలంలో అందేలా తీసుకుంటున్న చర్యలను చైర్మన్ గవర్నర్కు వివరించారు. 

రేషన్ దుకాణాల్లో అవినీతిని అరికట్టడానికి డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తున్నామని, దీని ద్వారా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తున్నామని తెలిపారు.గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించడంలో కమిషన్ పోషిస్తున్న పాత్రను సభ్యులు వివరించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహార భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కమిషన్ చేస్తున్న కృషి అభినందనీయం. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, గవర్నర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో ఆహార సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు.