03-12-2024 10:03:56 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): వన్యప్రాణుల బోర్డుకు కొత్త సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ బోర్డుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా, వైస్ ఛైర్ పర్సన్ గా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహరించనున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలతో కలిపి మొత్తం 29 మందితో వన్యప్రాణుల బోర్డును ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జ, వంశీకృష్ణ, మురళీ నాయక్, పాయం వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.