calender_icon.png 15 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ తెలంగాణ

15-11-2025 02:04:03 AM

  1. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ఱారావు
  2. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధి బృందంతో సమావేశం

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైనదని, దేశంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ గా తెలంగాణ ఉన్నదని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే.రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మూసీ నది సుందరీకరణ, యంగ్ ఇండి యా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, రాష్ట్రం లో రోడ్ల విస్తరణ తదితర ప్రాజెక్టులపై ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధి బృం దంతో శుక్రవారం సచివాలయంలో సీఎస్ సమావేశమయ్యారు.

తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పన, రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌లో సివరేజ్ ప్లాంట్ల నిర్మాణం, హ్యామ్ రోడ్ల విస్తరణ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ విద్యుత్ అనుసంధానం, టీఎస్ ఆర్టీసీ ఈ యంగ్ ఇండి యా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీల్లో చేపట్టే ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు వివరాలు, ఆర్థిక పరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

పరస్పర సహకారంతో నిర్దేశించిన ప్రాజెక్టులను వేగ వంతం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధా నకార్య దర్శి వికాస్ రాజ్, ఇంధన శాఖ ము ఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళికా శాఖ కార్య దర్శి జ్యోతి బుద్దా ప్రకాష్, పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, మెట్రో రైల్ ఎండీ స ర్ఫరా జ్ అహ్మద్, టీజీఐఐసీ డైరెక్టర్ శశాంక, హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ ఎండీ అశోక్‌రెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.