03-06-2025 12:37:55 AM
నిజామాబాద్ జూన్ 2: (విజయ క్రాంతి): భావా వ్యాప్తి,దశబ్దాల ఉద్యమబాట, పోరాటం, సకలజనుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సకార మయిందని ఇంచార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనక దుర్గ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్బంగా జిల్లాకోర్టు ప్రాంగాణంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం న్యాయమూర్థులు,న్యాయవాదులు, న్యాయసిబ్బందిని ఉద్దేచించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతోనే సరిపోలేదని, దాదాపు పన్నెండేళ్ల అభివృద్ధిని, ప్రగతిని సింహావలోకనం చేసునుని ముందడుగులు వేయాలని ఆమె పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగుతున్న మరిన్ని ప్రగతి పనులకు శ్రీకారం చుట్టుకోవలసిన అవష్యకత ఉన్నదని ఆమె తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని, జిల్లాల పెరుగుదలతో వికేంద్రికరణం విస్తరించి న్యాయార్థులకు న్యాయం మరింత చేరువ అయిందని జిల్లాజడ్జి కనక దుర్గ తెలిపారు.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి బార్ తరపున జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు గోపికృష్ణ, ఉపాధ్యాయ్, బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్,గవర్నమెంట్ ప్లీడర్ అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమం ఒక స్ఫూర్తి
కామారెడ్డి, జూన్ 2 (విజయ క్రాంతి), తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్య మము లో భాగంగా మిలియన్ మార్చ్ కు నేటితో 14 సంవత్సరాలు పూర్తయింది. ఆనాటి మిలియన్ మార్చ్ లో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆనాడు పడవలో ట్యాంక్ బండ్ కు చేరుకొని మిలియన్ మార్చ్ లో పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునఎగిసి పడ్డ సందర్భం,ఆంక్షలు పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టుకుని లక్షలాదిగా తరలివచ్చిన జనం,స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ ప్రస్థానంలో అధో కీలక ఘట్టం,ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం,
ఆంక్షలు నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసి జలమార్గం గుండా ట్యాంక్బండ్ చేరుకొని విలియం మార్చ్ లో పాల్గొని 2జూన్ 2025 కు14 ఏళ్ళు పూర్తయ్యాయి,ఆ అపురూప దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నా యని నాటి ఉద్యమ పోరాటాలు ఇంకా రగిలిస్తూనే ఉన్నా అని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు.
బాన్సువాడ ఏఎంసీ కార్యాలయంలో
బాన్సువాడ, జూన్ 2 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వ గణేష్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంత్రి గణేష్ జెండా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ మాసాని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ, జరుపు అంబరుసింగ్, వెంకట్ రెడ్డి, కొత్తకొండ భాస్కర్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీను, అక్బర్, కార్యాలయ సిబ్బంది శేషు, తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడ, జూన్ 2 (విజయ క్రాంతి), ఎందరో మహానీయుల ప్రాణ త్యాగాల ఫలితమే నేటి నవ తెలంగాణ అని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారము కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు తెలంగాణ లక్ష్యంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మ యి, డి.ఎస్.పి విట్టల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలో..
ఎల్లారెడ్డి, జూన్ 2 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఫాంహౌస్ వద్ద పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, మరో స్వతంత్ర పోరాటాన్ని తలపించే యుద్ధం,స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు.
కేసీఆర్ గారి నాయకత్వం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, విండో చైర్మన్ ఏగుల నర్సింలు, మాజీ కౌన్సిలర్ సాయిలు, మాజీ సర్పంచ్ రఘువీరగౌడ్ , సొసైటీ డైరెక్టర్ నారాయణ , దేవదాస్ , లక్ష్మణ్, పోల్, రేషన్ డీలర్ ల సంగం జిల్లా అధ్యక్షుడు నాగం సురేందర్ , నాయకులు రాజు, అరవింద్ గౌడ్, నాగం రాజయ్య, మల్లారెడ్డి, పృథ్వీరాజ్, రవి, గోపాల్ , యువజన నాయకులు పడమటి దయాకర్, ఆదిత్య , భూపాల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి
నిజామాబాద్, జూన్ 2:(విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా విశదపరిచారు.
ఈ వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎఫ్ఓ వికాస్ మీనా, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు.
జిల్లా బాలభవన్, ఇతర డాన్స్ అకాడమీల కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా బాలభవన్ చిన్నారులు తల్లి భారతి వందనం గీతంపై నృత్య ప్రదర్శనతో పాటు ఆత్మ రక్షణ ఆవశ్యకతను చాటుతూ కర్రసాము విద్యను ప్రదర్శించారు. సతీష్ డ్యాన్స్ మాస్టర్ నేతృత్వంలో శివా ఆరట్స్ కళాకారులు పేరిణి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
సిద్దార్థ కళాక్షేత్రం విద్యార్థులు శివస్త్రోత్రం పై సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. శివాని నాట్యాలయం చిన్నారులు గిరిజన సంస్కృతిని చాటేలా లంబాడా నృత్యంతో తమ ప్రతిభను చాటుకున్నారు. చైర్మన్ అనిల్ ఈరవత్రి, కలెక్టర్, సీ,పీ, ఇతర అధికారులు కళాకారుల వద్దకు వెళ్లి వారిని అభినందించి జ్ఞాపికలు బహూకరించారు. కాగా, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు.
బీసీ సంక్షేమ శాఖ, గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్యం, అగ్నిమాపక, రవాణా శాఖల శకటాలు పోటాపోటీగా ప్రదర్శనలో పాల్గొన్నాయి. రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర నిఘా కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన డ్రోన్ వ్యవస్థను పరిచయం చేస్తూ ప్రయోగాత్మకంగా పనితీరును ప్రదర్శించారు.
వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, అటవీ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, ఫిషరీస్, విద్యా శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.
టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ..
కామారెడ్డి, జూన్ 02 (విజయ క్రాంతి): తెలంగాణ 11 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ శాఖ భవనమునందు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాల ఫలితమే నేటి నవ తెలంగాణ అనిప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు అమరుల యొక్క పోరాటాలను స్మరిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులు ఆత్మబలిదానాలఫలితమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు 1200 మంది ఆత్మ బలి దానాల ఫలితమే నని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం దేశంలోనే ఆర్థికంగా ముందు వరుసలో ఉండే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ధనిక రాష్ట్రం ఏర్పడే వరకు పాలకులు కఠినమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం జిల్లా కేంద్రంలో గల అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచాలతో నివాళులు అర్పించిన టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ బృందం.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎమ్. నాగరాజు. అసోసియేట్ అధ్యక్షులు చక్రధర్, జిల్లా కోశాధికారి ఎమ్. దేవరాజు ఉపాధ్యక్షులుయు.
సాయిలు, లక్ష్మణ్ మరియు రాజ్యలక్ష్మి .. సంయుక్త కార్యదర్శులు గణేష్, రమణ కుమార్ అబ్దుల్ ఖాదిర్.. ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, జిల్లా నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏర్గట్లలో ..
ఏర్గట్ల, జూన్ 02,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మండల కేంద్రం ఏర్గట్లలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవమును జాతీయ జెండాను ఆవిష్కరించిన ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, జిల్లా పార్టీ డెలిగేట్ గడ్డం జీవన్ రెడ్డి, ఏర్గట్ల పట్టణ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి తెలంగాణ రాష్ట్ర అమరవీరులకు జోహార్లు అర్పించారు.అనంతరం స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమములో టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల సాయన్న, భూమన్న, బొర్రన్న, రవి, పార్టీ కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.
తాడ్వాయి..
తాడ్వాయి, జూన్, 2( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఇన్చార్జి తహlసిల్దార్ బిక్షపతి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో పాజిద్ అలీ పోలీస్ స్టేషన్లో ఎస్త్స్ర మురళి ఐకెపిలో, సింగిల్ విండోలో చైర్మన్ కపిల్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో,
గ్రామపంచాయతీల ఆవరణలో జెండాను ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
కామారెడ్డి, జూన్ 2 ( విజయక్రాంతి), ఎంతోమంది త్యాగదనుల పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని రాష్ట్ర మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు సోమవారం కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకులు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గైని శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, జగదీష్ యాదవ్, కుంభాల రవి యాదవ్, మాజీ జెడ్పిటిసి రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.