calender_icon.png 4 June, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు, రైతులకు మెరుగైన విద్యుత్‌సేవలు అందించాలి

03-06-2025 12:38:15 AM

రాష్ట్ర  నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

సూర్యాపేట జూన్ 2 (విజయక్రాంతి) : ప్రజలకి, రైతులకి మెరుగైన విద్యుత్ సేవలందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో రూ.7.61 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత జిల్లా విద్యుత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నంద్ లాల్ పవార్, టి జి ఎస్ ఎస్ డి సి ఎల్ చీప్ ఇంజనీర్ బాలస్వామి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ లతో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో  వ్యవసాయం ఎక్కువగా సాగు చేస్తున్నందున రైతులకి విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయాలన్నారు వర్షాలు, పకృతి విపత్తులు సంభవించినప్పుడు విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. తదుపరి ఎస్ ఈ ప్రాంక్లిన్ ని కుర్చీలో  కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటి చైర్మన్ వేణారెడ్డి, ఆర్డివో వేణు మాధవ్, ఈ ఈ కృష్ణారెడ్డి, డి ఈ శ్రీనివాసులు,తహసీల్దార్ కృషయ్య, ఎ ఈ శేఖర్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.