calender_icon.png 4 June, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ మేనేజ్మెంట్ చేస్తే ఊరుకోను

03-06-2025 12:36:45 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ, జూన్ 2 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో మిస్ మేనేజ్మెంట్ చేస్తే ఊరుకోబోనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం మునుగోడు మండలంలోని చీకటిమామిడి, కొంపెల్లి  గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు.

ప్రజా ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లులు  పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా  నిర్మాణాలు జరగాలన్నారు. ఇందిరమ్మ ఇల్లుల మంజూరులో, నిర్మాణంలో అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోనన్నారు. చీకటి మామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరైన 21 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు.

అనంతరం కొంపెల్లి గ్రామంలో  భూమి పూజ చేసి ఆ గ్రామ లబ్ధిదారులకు కూడా ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో  ఇంటి నిర్మాణ ప్లాను  లబ్ధిదారులకు ఉన్న స్థలాల ఆధారంగా వారికి శాశ్వతంగా ఉపయోగపడే విధంగా  ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో విజయ భాస్కర్, ఇన్చార్జి ఎమ్మార్వో నరేష్, ఎంపీ ఓ స్వరూప, గృహ నిర్మాణ శాఖ అధికారులు  స్థానిక నాయకులు పాల్గొన్నారు.