calender_icon.png 28 June, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

29న తెలంగాణ నాయర్ సేవ సంఘం ఆవిర్భావం

28-06-2025 12:41:12 AM

తెలంగాణ నాయర్ సేవ సంఘం అధ్యక్షులు కె. సురేంద్రన్

ముషీరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): సామాజిక నిబద్ధతకు పర్యాయ పదంగా నాయర్ సేవ సొసైటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంబించునున్నట్లు తెలంగాణ నాయర్ సేవ సొసైటీ అధ్యక్షులు కె. సురేంద్రన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి ఏం.కె. శశి కుమార్, కోశాధికారి పి. సేతుమాధవాన్ తదితరులతో కలసి కె. సురేంద్రన్ తెలంగాణ నాయర్ సేవ సంఘం ఆవిర్భావ గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాయర్ సేవ సొసైటీ 100 సంవత్సరాల క్రితం ప్రముఖ సామజిక వేత్త మన్నతు పద్మనాభన్ స్థాపించారని, దేశం మొత్తం 8 వేల శాఖలతో సేవలందిస్తుందని చెప్పారు. ఈ నెల 29న హైదరాబాద్, కాప్రా లోని ఎర్ర లలిత ఫంక్షన్ హాల్ లో గోవా రాష్ట్ర గవర్నర్ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై తెలంగాణ నాయర్ సేవ సొసైటీ ని ప్రారంభిస్తారని, లోక్ సభ సభ్యులు ఎన్.కె.ప్రేమచంద్రన్ తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొంటారన్నారు.