28-06-2025 12:41:58 AM
-పూరిజగన్నాథున్ని తలపించే రథయాత్ర
-పూరి జగన్నాథుని ఆలయ నిర్మాణానికి సహకరిస్తా
- గుమ్మడికాయతో రథయాత్ర
-ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ జూన్ 27: (విజయ క్రాంతి): గత కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ్ రాథోత్సవాన్ని తలపించేల రీతిలో మన ఇందూర్ ఇస్కాన్ భక్తులు పూరి జగన్నాధుని పూజా మహోత్సవం రథయాత్ర నిర్వహించడం ఆనందంగా ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పూరిజగన్నాథ రథోత్సవానికి ముఖ్యఅతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణగ భక్తీ శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుమ్మడికాయలతో దిష్టితీసి రాతయాత్రను సూర్యనారాయణ ప్రారంభించరూ.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు పూరి జగన్నాథుని ఆలయ నిర్మాణానికి స్థలం తోపాటు నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని భక్తులకు హామీ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుని రథయాత్రకు దర్శించు కోలేని భక్తులకు ఇందూర్ లోని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి రథోత్సవం స్వామిని దర్శించుకునే అదృష్టాన్ని ఇస్కాన్ వారు అందించారని అన్నారు. శ్రీకృష్ణ తత్వాన్ని, మహా భగవత్ సమస్త మానవాళి జీవనానికి గల ప్రాముఖ్యతను గత వారం రోజులుగా భక్తులకు భా సప్తాహం ద్వారా తెలియజేశారని ఆయన అన్నారు.
శ్రీకృష్ణుడు సకల శుభాలను అందించి భక్తుల కష్టాలను తీర్చేటటు వంటి స్వామి నకు దర్శనమి స్తారని అన్నారు. కలియుగంలో పూరిజగన్నాధు ని రూపంలో స్వామి భక్తులచే పూజలు అందు కుంటున్నారని ఆ థయాత్ర లో స్వామిని దర్శించుకోవడం రథసే వ చేయడం మహా భాగ్యమని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో పూరిజగన్నాథు ని అనుగ్రహంతో సుఖసంతోషాలతో ఉండాలని ధన్పాల్ సూర్యనారా యణ ఆకాంక్షించారు.
కేంద్రప్రభుత్వం హిందూ ఆలయాల పునః నిర్మాణానికి పునుకుందని అన్నారు అందులో భాగంగా పూరి జగన్నాథ్ ఆ లయా అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందూర్ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ప్రముఖ న్యాయవాది కృపాకర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ సిద్ద బలరామ్,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం హాజరయ్యారు. పూరి జగన్నాథుని రథయాత్ర నగర వీధుల గుండా సాగింది.