calender_icon.png 4 June, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

02-06-2025 05:56:53 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకల్లో జెండా ఆవిష్కరించారు. అక్బర్ ఖాన్ మాట్లాడుతూ... ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

సంవత్సరాలకు సంవత్సరాలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తుదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తిరుపతిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి విలాస్ రావు, మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, గుడాల శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షుడు ఎజాస్, కటకం అశోక్, కుంభం పద్మ, వామన్ రావు, అయిత తిరుపతిరెడ్డి, శంకరయ్య, కోట సమ్మయ్య, దాహగం సంతోష్, బుర్రి శివారాజు, నయన్ మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు మహిళలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.